ATP: గుత్తి మున్సిపాలిటీ అప్ గ్రేడ్ అయ్యింది. జనాభా, ఆదాయం ఆధారంగా థర్డ్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మీయా తెలిపారు. అప్ గ్రేడ్ కావడం వల్ల ఎక్కువ నిధులతో పాటు అదనపు సిబ్బంది వస్తారని, మున్సిపాలిటీ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందన్నారు.