SKLM: ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను రెండు రోజుల్లో వేతన దారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు జిల్లా డ్వామా PD జి.వి. లవ రాజు సోమవారం ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల గత కొన్ని రోజులుగా ఆగిన పేమెంట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు.