కోనసీమ: సఖినేటిపల్లి(M)లోని 5 ఆలయాల్లో హుండీలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు SI దుర్గా శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. భీమవరానికి చెందిన ధనుశ్, చలపాక ప్రవీణ్లను రాజోలు కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.11,022 నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. జైలుకు తరలించినట్లు తెలిపారు.