ADB: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని గుడిహత్నూర్ మండల పరిధిలో యువతిని మోసం చేసిన ఆత్రం గణపతి, సలాం వరుణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బాధితురాలి నుంచి రూ.15 వేలు వసూలు చేయగా, ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఉద్యోగాల పేరుతో నమ్మించే మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు.