MDCL: ఖైతలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. అమృత్నగర్ తండాకు చెందిన 62 మంది నిరుపేదలకు బుధవారం ఇళ్ల పంపిణీ జరగనున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. గతంలో లాటరీ ద్వారా 67 మందికి ఇళ్లు కేటాయించగా, మిగతా 62 మందికి ఇక్కడే ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు.