VKB: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రెండో పీఆర్సీని అమలు చేయడంతో పాటు పెండింగ్లోని డీఏ, డీఆర్లను వెంటనే విడుదల చేయాలని టీజీ ఈజేసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం యాలాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో జాప్యం చేయొద్దు అన్నారు.