PDPL: ధర్మారం మండల కేంద్రంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం, జువాలజీ, చరిత్ర పరీక్షకు ఐదుగురు విద్యార్థులు గైర్హాజరు అయ్యారని చీఫ్ సూపరింటెండెంట్లు అనంత రామకృష్ణ, గీతా వాణి తెలిపారు. మొత్తం 383 మందికి 378 మంది హాజరయ్యారు. ప్రభుత్వ కళాశాలలో 268 మందికి 268 మంది హాజరయ్యారు. సాధన కళాశాలలో 115 మందికి 110 మంది హాజరు కాగా, 5 గురు గైర్హాజరయ్యారు.