PDPL: మంథనిలోని పద్మశాలి వీధి వద్ద అక్రమంగా PDS బియ్యం తరలిస్తున్న గంట సమ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10 సంచుల్లో సుమారు 4.60 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన బియ్యం విలువ రూ. 21,080గా అంచనా వేశారు. ఈ బియ్యాన్ని బేగంపేటకు చెందిన తూర్పాటి రాజుకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వెల్లడించాడు.