NRML: భారీ వర్షానికి పంట నష్టపోయిన జిల్లా రైతులను తక్షణమే నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బుఖ్య రమేష్ డిమాండ్ చేశారు. కడెంలో వారు మాట్లాడుతూ.. గత రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి పంట, నువ్వుల పంట, ఆరబెట్టిన పసుపు కొమ్ములు, మొక్కజొన్న, వరి తదితర పంటలు నేలమట్టమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.