దేశంలో మొబైల్ డేటా వినియోగం వేగంగా పెరుగుతోందని ప్రముఖ టెలికాం గేర్ తయారీ సంస్థ నోకియా వెల్లడించింది. 2025లో నెలవారీ సగటు వినియోగం 31జీబీగా ఉందని చెప్పింది. 2024లో మొబైల్ డేటా వినియోగం 27.5 జీబీ అని పేర్కొంది. దేశంలో 5జీ డేటా వినియోగం గతేడాదితో పోలిస్తే 70 శాతం పెరిగినట్లు వివరించింది. దేశంలో మొత్తం మొబైల్ బ్రాండ్ ట్రాఫిక్లో 5జీ వాటా 47 శాతంగా ఉందని నోకియా తెలిపింది.