ఆసిఫాబాద్ పట్టణం బజార్ వాడీలో నిర్వహించిన SIR మ్యాపింగ్ కార్యక్రమానికి మంగళవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యాపింగ్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించిన ఆయన, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ మ్యాపింగ్ ప్రక్రియ పౌరులందరికీ ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు.