NGKL: జిల్లాకు చెందిన మాజీ మంత్రి పోతుగంటి రాములుకు బీజేపీలో కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. రాములు సుదీర్ఘ రాజకీయ అనుభవం తెలంగాణలో పార్టీ బలోపేతానికి, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.