AP: తెలుగువారి అభిమాన ‘అన్నగారు’ NTR 1982 మార్చి 29న స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ 44వ వసంతంలోకి అడుగులు వేస్తోంది. ఢిల్లీ పాలకుల ముందు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకూడదనే నినాదంలో ఆవిర్భవించిన TDP.. 9 నెలల్లోనే 294కు 202 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చింది. రూ.2కే KG బియ్యం, వృద్ధ/వికలాంగ/వితంతువులకు పింఛన్లు తదితర ఎన్నో కొత్త పథకాలతో సంస్కరణలు తెచ్చింది.