PPM: నగర సుందరీకరణ పనుల్లో భాగంగా బ్రిడ్జి సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు. శనివారం గెడ్డ వీధిలో కలెక్టర్ స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చివరి భాగంలో కొబ్బరి మొక్కలను నాటడం జరిగిందన్నారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ వైశాలి ఉన్నారు.