NLG: కొండభీమనపల్లిలో గత నెల 21న జరిగిన దొంగతనం కేసులో నిందితుడు మెహబూబ్ పాషాను అరెస్ట్ చేసినట్లు దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. తాళం వేసిన శంకరయ్య ఇంట్లోకి చొరబడి రూ. 90,000 నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను అపహరించినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి కొంత సొమ్మును రికవరీ చేసి, రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.