BDK: పినపాక మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గర్భిణీ కారం జయశ్రీకి ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను జానంపేట పీహెచ్సీకి తరలించి 108కి సమాచారం అందించారు. మెరుగైన చికిత్స కోసం సిబ్బంది ఆమెను మణుగూరు తరలిస్తుండగా సీతారామపురం సమీపంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్లోనే సిబ్బంది ప్రసవం చేశారు.