NLG: చిట్యాల పురపాలికలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పై మూత లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోయారు. దోమల వ్యాప్తి పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నామని వార్డు ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీపై మూతను ఏర్పాటు చేసి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.