HYD: మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మధుమేహ, కంటి, దంత వైద్య పరీక్షలను చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్.అంజనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి వసతి గృహం ద్వారా అందించే ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.