SRPT: చివ్వేంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడిసె రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ చింతమళ్ళ రమేష్, కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి పాల్గొన్నారు.