ASF: సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో, ఇతరులకు హాని కలిగించకుండా సూచించారు. ప్రధాన కూడళ్లలో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.