BHNG: చౌటుప్పల్ మండలం జెకేసారం గోకారం చెరువు, బోర్లు అడుగంటడంతో 150 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. ‘ఇంటింటికి సీపీఎం’లో భాగంగా ఇవ్వాళ పొలాలను పరిశీలించిన CPM నేతలు కృష్ణారెడ్డి, కిష్టయ్య.. ధర్మారెడ్డి పల్లి కాలువ పనుల జాప్యం వల్లే ఈ దుస్థితి అని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.