HNK: ఐనవోలు మండలం నందనం గ్రామంలో నాబార్డ్ సహకారంతో నందనం సొసైటీ ఆధ్వర్యంలో రైతుల కోసం డ్రోన్ సేవలను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గురువారం ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా పంటలకు ఎరువులు, పురుగు మందులు సమర్థంగా పిచికారీ చేయడం వల్ల రైతులకు ఖర్చు తగ్గడం, సమయం ఆదా కావడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.