SRD: సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మైదానంలో కిక్ బాక్సింగ్ పోటీలు సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.