JGL: ప్రతిరోజు నడవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ వాణి పేర్కొన్నారు. పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన డెయిలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, శారీరక దృఢత్వానికి వాకింగ్ వంటి అలవాట్లు ఎంతో ఉపయోగకరమన్నారు.