ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్లు ప్రమాదానికి పొంచి దర్శనమిస్తున్నాయి. రోడ్డు సమీపంలో ఉన్న విద్యుత్తు స్థంబాల తీగలకు చెట్ల కొమ్మలు విపరీతంగా పెరిగి అంటుతుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.