RR: శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసుల దాడిలో జల్ పల్లిలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సింథటిక్ రంగులు, నాసిరకం పదార్ధాలతో పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సుమారు రూ.10 లక్షల విలువైన 340 కిలోల పేస్ట్, ముడిసరుకు,యంత్రాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.