నిర్మల్ జిల్లా ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందించడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. నిర్మల్లో నేడు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఇందుకోసం రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా పోలీస్ అక్క విజ్ఞత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇటీవల జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు అందుకున్నామన్నారు.