WNP: వనపర్తిలో నేటి నుంచి మూడు రోజుల పాటు విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.