MNCL: అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జన్నారం మండల ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. వేసవి నేపథ్యంలో మంగళవారం జన్నారంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు అగ్నిప్రమాదల నివారణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రమాదాలు జరిగిన వెంటనే సమాచారం అందిస్తే మంటలను ఆర్పి వేస్తామని ఆయన పేర్కొన్నారు.