NZB: మోపాల్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కారోబార్స్, పారిశుద్ధ్య సిబ్బంది పెండింగ్ వేతనాలను చెల్లించాలని నిజామాబాద్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామపంచాయతీలో వేతనాలు లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు తెలిపారు. కుటుంబ సర్వే నిర్వహించి సంవత్సర కాలం గడుస్తున్నా ఎన్యుమరేటర్లు గౌరవ వేతనం అందలేదన్నారు.