GDWL: మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, వాకిటి శ్రీహరి జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులకు ఆదేశించారు. 11.94 TMCల నీటి సామర్థ్యం పూడిక వల్ల 9 TMCలకు పడిపోవడంపై సమీక్ష చేశారు. నిల్వ సామర్థ్యం పెంచి, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు త్వరగా చేపట్టాలని సూచించారు.