MDK: చేగుంట మండలం కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాలను కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కృష్ణారావు మంగళవారం సందర్శించారు. తరగతి గది బోధనను పరిశీలించి, కృత్యాల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థుల ప్రతిభపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి, వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.