NGKL: పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి మైసమ్మ ఆలయాన్ని డీఎస్పీ శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఆదివారం సీఐ, SIలతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు డీఎస్పీని ఘనంగా సన్మానించారు. పోలీసు అధికారుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.