MLG: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని మంత్రి సీతక్క అన్నారు. సచివాలయం నుంచి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. 99 రోజుల పాటు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి మౌలిక మార్పులు తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు.