KMR: తన సొంత వ్యవసాయ భూమిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో ఇవాళ సాయంత్రం చోటుచేసుకుంది. దోమకొండ మండలం చింతమాన్ పల్లి గ్రామానికి చెందిన శివాయిపల్లి లింగవ్వకు కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఎప్పటిలాగే వ్యవసాయ భూమి వద్దకు వచ్చిన లింగవ్వ అదే భూమిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.