SRD: మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులోని మంజీర నది ఒడ్డున ఉన్న శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో త్వరలో జరగనున్న ఏడు గురువారాలు, ఏడు ఆదివారాలు మహోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో కూర్చోవడానికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జుక్కల్ గ్రామానికి చెందిన వీరన్న ఆలయానికి సిమెంట్ బెంచీలను అందించారు.