MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆదరణను చూరగొంటోందని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల రెండవ తేదీన గ్రామస్థాయిలో పట్టణ స్థాయిలో నిర్వహించిన గ్రామసభలు విజయవంతం అయ్యాయని వెల్లడించారు. ప్రజలు తమ ప్రభుత్వంతో ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.