ELR: పాపుల రక్షణ కోసం శిలువపై ప్రాణత్యాగం చేసి త్యాగానికి మారుపేరుగా నిలిచిన క్రీస్తు మహిమను ఘనపరిచేందుకు ఆయన చూపిన బాటలో పయనించాలని ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్భోదించారు. శనివారం ఏలూరులో ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతియుత జీవనాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు.