NGKL: కల్వకుర్తి పట్టణంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీని మున్సిపల్ ఛైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ…ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చినది ఏసుప్రభువు అని అన్నారు. ప్రభు ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు.