పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో వైసీపీ శ్రేణులు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను పాడుచేస్తున్నారని ఆరోపిస్తూ ఐటీడీఏ పెట్రోల్ బంక్ సెంటర్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.