MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో శనివారం గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రచార కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ప్రారంభించారు. పశువులకు వ్యాధులు సంక్రమించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.