MDCL: అల్వాల్ పట్టణ పరిధి టెంపుల్ అల్వాల్ హరిదాస మండపంలో 75వ శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీ సీతాష్టోత్తర శతనామ కుంకుమార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, పూజలు చేశారు. శనివారం సాయంత్రం పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం ఉంటుందని తెలిపారు.