NLG: గుమ్మడవెల్లి గ్రామంలో తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు సర్పంచ్ ఆదిరాల సుమలత రమేష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పంచాయతీ సిబ్బందితో కలిసి నీటి ట్యాంకులను శుభ్రం చేయించి, ప్రతి ఇంటికీ సరఫరా పునరుద్ధరించారు. వేసవిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, నీటి వృధాను అరికట్టాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.