KMM: కొణిజర్ల మండలం పెద్దగోపతి పంచాయతీ పరిధిలో ఎండిపోతున్న పామ్ చెరువుకు నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఊటుకూరి రంజిత్ బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వినతిపత్రం అందజేశారు. చెంతనే నీళ్లున్నా చెరువు ఎండిపోతోంది అంటూ రైతుల దీనస్థితిని వివరించారు. సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.