SDPT: ఉమ్మడి మెదక్ జిల్లాలో మార్చి 15 నుంచి 17 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రైతులు తమ పంటలను కాపాడుకోవాలని, వర్షం సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.