SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ మోహినికుంట మల్లిఖార్జున స్వామి ఆలయ హుండీని ఈనెల 28న ఉదయం 11 గంటలకు లెక్కించబడునని ఆలయ పూజారి భద్రయ్య ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఆలయ ఆవరణలో జరిగే హుండీల లెక్కింపునకు పర్యవేక్షణకు దేవాదాయ శాఖ, జగిత్యాల డివిజన్ పరిశీలకులు పర్యవేక్షణలో భక్తుల సమక్షంలో హుండీలు లెక్కించబడునని పేర్కొన్నారు.