MDCL: ఘట్కేసర్ పరిధిలోని మేఘా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని గాయత్రి(23) అదృశ్యం కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈమె, హాస్టల్ వార్డెన్ అనుమతితో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల వద్దకు కూడా చేరుకోకపోవడంతో వార్డెన్ ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.