జనగామ జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం, షీటీం కేంద్రాలను డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. డీజీపీకి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం భరోసా, షీటీం కేంద్రాల్లోని వివిధ విభాగాలను డీజీపీ పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.