PDPL: పర్యావరణ పరిరక్షణకు అందరం కలిసి కృషి చేద్దామని రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కాన్ సింగ్ పిలుపునిచ్చారు. పొల్యూషన్ను నివారించి పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రామగుండం సింగరేణి ప్రాంతం బొగ్గు గనులు NTPCకు భారతదేశంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.