SDPT: చదువుతో సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నకోడూర్ మండలం కస్తూరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహ నిర్మాణానికి బుధవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహం నిర్మాణానికి రూ. 20 వేలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.